Wednesday, September 25, 2013

నరనారాయణ ఋషులు

నరనారాయణ ఋషులు 

నారాయణణుడు (ఋషి) సాక్షాత్ పరమాత్మే, నరుడు (ఋషి) ఆయన అంశావతారమే. అష్టాక్షరీ మంత్రం ---- ముందుగా ఓంకారాన్ని ఉచ్ఛరించి, తరవాత నమః , నారాయణాయ అనే రెండు పదాలు చెప్పే అత్యద్భుతమైన మంత్రం. సకల ప్రయోజనాలని సాధించగలిగేది. "మంత్రరాజం" అనే బిరుదు గలది. ఆ మంత్రాన్ని లోకానికి తెలియపరచినది నారాయణుడే. 

బదరికాశ్రమంలో నారాయణుడు -- నరునికి ఉపదేశించారు. అక్కడ నుండి పరంపరగా ఈ నాటికీ అందరికీ అందుతూ వస్తోంది ఆ మంత్రం. లోకంలో గురుశిష్య సంబంధం ఎలా ఉండాలో నేర్పింది కూడా ఈ నరనారయణులే. 

చతుర్ముఖబ్రహ్మ కుడి బొటనవ్రేలి నుండి ధర్ముడు, అనే అతను జన్మించాడు. దక్షుడి కుమార్తెలలో ఒకరైన మూర్తి అనే ఆమెను వివాహమాడెను. వారిరువురికీ కలిగిన సంతానమే నరనారాయణులు (ఋషులు). వీరు కవలలు. వీరు కృతయుగంలో అవతరించారు. 

తమ పరాక్రమంతో దంబోద్భవుడు అనే రాక్షసుని గర్వం అణచి, సహస్రకవచుడు అనే రాక్షసుని 999 కవచాలు భేదించి, చివరికి మిగిలిన ఒక కవచంతో కర్ణునిగా పుడితే, తాము కూడా కృష్ణార్జునులుగా అవతరించి, కర్ణుని సంహరించారు. అప్సరసల సౌందర్యగర్వం తొలగించుటకు ఊర్వశిని సృష్టించారు. 

అష్టాక్షరీ మంత్రశక్తి ఎంతగా ప్రసరిస్తే, మనందరికీ  అంత మంచిది. మానవులమైన మనం అల్ప శక్తులం కాబట్టి, మనం మంత్రాన్ని ఎక్కువగా జపించలేము అని, నరనారాయణులు ఇప్పటికీ పర్వత రూపాలలో ఉండి, అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు. 

బద్రీనాథ్ వెళ్ళేవారంతా ఆలయంలోని నారనారాయణ విగ్రహమూర్తులనే దర్శించటం కాక, పర్వత రూపాలలో ఉన్న వారిని కూడా దర్శించుకొని, కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి, వారి సంస్కారాన్ని తెలియపరుస్తారు. 


                               

No comments:

Post a Comment