Sunday, January 17, 2016

దోసపళ్ళు

దోసపళ్ళు

త్రోవలో ఒకరాజు తోటేసినాడు
తోటలోపల పండ్లు దొర్లుతున్నావి.
దొర్లుతున్నవి తియ్య దోసపండ్లన్ని,
ఆ పండ్లు పంపాడు ఆరగించంగ.
తింటేను తియదోస పండ్లే తినాలి,
కంటేను కొడుకుల్ల కాన్పే కనాలి.
అందితే అన్నతో వియ్యమందాలి.
ఆడితే వదినతో జగడమాడాలి.



No comments:

Post a Comment